హీరో నాగర్జున దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఆఫీసర్. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది.అయితే ఈ సినిమా విఝయంలో హీరో నాగ్ మదనపడుతున్నాడు. అసలు ఈ కథను ఎందుకు ఎంచుకున్నానని భాదపడుతున్నాడని సమాచారం.ఇప్పటికే రీలిజ్ అయిన టీజర్,ట్రైలర్కు పెద్దగా ఆకట్టుకొలేదనే చెప్పాలి.రీసెంట్ గా ల్యాబ్ లో ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయాడట.
తను నటించిన సినిమా తనకే నక్చకపోవడంతో చాలా బాధ పడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని డైరెక్టర్ కు నేరుగా చెప్పినా.. వర్మ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండానే సినిమా విడుదల చేయడానికి సిద్దపడుతున్నాడని తెలుస్తోంది. గతంలో నాగార్జునతో ‘శివ’ వంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కావడంతో వర్మను ఏం అనలేక సైలెంట్ గా ఉండిపోయాడట నాగ్.