Saturday, May 3, 2025
- Advertisement -

చంద్రబాబుకు షాకిచ్చిన బాంబే హైకోర్టు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. చంద్రబాబుతో పాటు టీడీపీ నేత నక్కా ఆనందబాబుపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది.

చంద్రబాబుపై కేసును కొట్టివేసేందుకు నిరాకరించిన బాంబే హైకోర్టు…నేరారోపణలో నిందితుల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు తగిన ఆధారాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది. ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, గాయపడిన పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారని, దీనినిబట్టి నేరానికి సంబంధించి తగిన సమాచారం ఉన్నట్టేనని అభిప్రాయపడిన ధర్మాసనం..ఈ కేసును కొట్టివేయడం సముచితం కాదని పేర్కొంది.

నిందితులపై కేసు నమోదు, దర్యాప్తు వంటి వాటిలో చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టు తమకు అనిపించలేదని జస్టిస్ మంగేశ్ పాటిల్, జస్టిస్ శైలేశ్ బ్రహ్మేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే చంద్రబాబుకు స్వల్ప ఊరట కలిగించే విషయం ఏంటంటే.. 13 సెప్టెంబర్ 2023న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను జులై 8 వరకు పొడిగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -