క్రికెట్ లవర్స్కి గుడ్ న్యూస్. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్స్లో క్రికెట్ను చూసే అవకాశం దక్కింది. 2028లో లాస్ ఏంజెలెస్లో జరిగే ఒలింపిక్స్ నుంచి క్రికెట్ను చేర్చనున్నారు నిర్వాహకులు. మొత్తం ఆరు జట్లతో T20 ఫార్మాట్లో మ్యాచులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మెన్స్ క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ పోటీలు ఉండనున్నాయి.
ఒలింపిక్స్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు పాల్గొంటాయి. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఈ జట్లను ఫైనల్ చేశారు. ఈ ఒలింపిక్స్లో పాకిస్థాన్ జట్టుకు ఛాన్స్ దక్కలేదు.
టీమిండియా– 20170,ఆస్ట్రేలియా – 12417, ఇంగ్లాండ్ – 12688, న్యూజిలాండ్ – 14652, వెస్టిండీస్ – 14587, దక్షిణాఫ్రికా – 11345 ఆరు స్థానాల్లో ఉండటంతో ఛాన్స్ దక్కించుకున్నాయి.