భారీ వర్షాలతో విజయవాడ నీట మునిగింది. వర్షం తగ్గుముఖం పట్టినా విజయవాడ ఇంకా జల దిగ్బందంలోనే ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఎల్లో మీడియా కవర్ చేసిందంతా కమాల్ అయింది. చంద్రబాబే స్వయంగా మా ఇల్లు మునిగింది అని ఒప్పుకున్నారు. అంతేగాదు కరకట్ట ఇల్లు అక్రమ నిర్మాణమే అని ఒప్పకున్నారు చంద్రబాబు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో వరద కరకట్టను ముంచెత్తింది. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతో పాటు ఈ ప్రాంతంలో కృష్ణా కరకట్ట పక్కన ఉన్న భవనాలన్నీ నీట మునిగాయి. వెంకటపాలెం వద్ద ఉన్న మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్య చికిత్స ఆశ్రమం నుంచి రోగులను అంబులెన్సులో విజయవాడకు తరలించారు.
సిఎం నివాసం ఇక్కడే ఉండడంతో అధికారులు మరమ్మత్తు చర్యలను వేగవంతం చేశారు. భారీ వర్షాలతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో పైర్లు నీట మునిగాయి. వరి, పత్తి, మిర్చి, పసుపు, కంది, కూరగాయాలు తదితర పంటలు నీటిలో తేలియాడుతుండగా రైతుల బాధ వర్ణనాతీతంగా ఉంది.