Tuesday, May 6, 2025
- Advertisement -

పోలీస్ జులుం ఎల్లకాలం సాగదు..జగన్ హెచ్చరిక

- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక సెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు.

ఈ క్రమంలో పోలీసులు వైసీపీ ప్రజాప్రతినిధులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లకార్డులు లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎప్పటికి శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని మండిపడ్డారు.

ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న పేపర్లను చించేసే అధికారం ఎవరిచ్చారంటూ నిలదీశారు. పోలీసుల జులుం ఎళ్లకాలం సాగదని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు జగన్. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమని అంతేగాని ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడానికి కాదని హెచ్చరించారు.

రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలు నశించాలని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. సేవ్‌ డెమొక్రసీ అంటూ నినదించారు. తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -