Tuesday, May 6, 2025
- Advertisement -

జనసేన నేతలతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేతలు!

- Advertisement -

ఏపీలోని మచిలీపట్నంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు టీడీపీ నేతలు . మచిలీపట్నంలో ఓ బ్యానర్ విషయంలో జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది.

పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశారు కూటమి నేతలు. తమ ఫోటోలు వేయకపోవడం పై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రెండు రోజుల క్రితం రాత్రి వేల బ్యానర్ ను చింపేశారు జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు.

బ్యానర్ చించేసిన యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యర్రంశెట్టి నానికి గాయాలు కాగా ఇళ్లు అంతా ధ్వంసం అయింది. ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్ చేశారు పార్టీ పెద్దలు. సెటిల్ మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతలు దాడికి పాల్పడటం విశేషం.

అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు టీడీపీ నేతలు . దీంతో టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పారు యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు. ఒకరి పై ఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు జనసేన, టీడీపీ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -