జనసేన అధినేత పవన్ కల్యాణ్పై టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ చేసిన వ్యాఖ్యలపై.. పవన్ అభిమాని, సినీనటి మాధవీలత మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.అయితే విమర్శలు చేసుకోవడం మామూలే. కాని ఇప్పుడు రాజకీయాల్లోకి మల్లెపూలు వచ్చిచేరాయి. వేడెక్కిన రాజకీయాన్నిమల్లెపూల సువాసన మరింత అగ్గి రజేసింది.
మల్లెపూలు ఏంటి రాజకీయాలేంటి అనుకుంటున్నారా…! వస్తున్న అక్కడికే వస్తున్నా..రెండు రోజులక్రితం జనసేన అధినేత పవన్ ధవలేశ్వరం బ్యారేజీ మీద కవాతు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ జగన్, బాబు, లోకేష్లను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయలేని లోకేష్కి ఏం తెలుసని పంచాయితీ రాజ్ శాఖకు మంత్రిని చేశారంటూ ఫైర్ అయ్యారు.
అంతే ఇంకేముంది టీడీపీ తమ్ముళ్లకు మండి పోయింది. అయితే పవన్పై టీడీపీ మహిళా నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేవలం పావలా కూడా విలువ చేయని పవన్ కళ్యాణ్.. రెండువేల రూపాయల నోటుతో సమానమైన లోకేష్ని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు.
మాట్లాడితే.. తాట తీస్తా, తోలు తీస్తా ఇంకేదో తీస్తా అంటున్నారు. ఎవరి తాట తీస్తారు? ఎవర్ని నలుపుతారు? మీరు కూర్చుని మల్లెపూలని తప్పతే ఇంకేమీ నలపలేరు అంటూ పవన్పై సంచలన కామెంట్ చేశారు టీడీపీ మహిళా నాయకురాలు యామిని సాధినేని.
అమె చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లలో హాట్ టాఫిక్గా మారాయి. ఇంకే ముంది పవన్ అభిమానులు రెచ్చిపోయారు. పవన్ మల్లెపూలు తప్ప ఇంకేం నలపలేడని అనడం పట్ల జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇంకొంతమంది మల్లెపూల కోసం ఈమెకు బాగా తెలిసినట్టు ఉందే అంటూ ట్రోలింగ్స్ మొదలుపెట్టారు.
వీరికి తోడు భాజాపా మహిళానేత, పవణ్ అభిమాని మాధవి లత కూడా ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.మల్లెపూల విషయం ఏంటో దగ్గర్నుంచి యామిని సాధినేని చూశారేమో..? చూసినప్పుడు అడగాలి కదా ఇప్పుడెందుకు అడగటం..? వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా..? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా తెలియదులేమ్మా..
మొత్తానికి పవన్, యామినిలు పరస్పర ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన ‘మల్లెపూలు’ కామెంట్స్.. సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారాయి. మరి మాధవీ కామెంట్స్పై సాధినేని ఏ విధంగా కౌంటరిస్తారో వేచి చూడాలి.