Saturday, May 10, 2025
- Advertisement -

73 మందితో ఫస్ట్ లిస్ట్..టీడీపీ అభ్యర్థులు వీరే!

- Advertisement -

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత టీడీపీ తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పినట్లుగానే తొలి జాబితాలో ఎలాంటి చిక్కులు లేని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు చంద్రబాబు.

తాజాగా ఆ పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 73 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లకు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. టీడీపీ తొలి జాబితా విడుదల చేసిన తర్వాత జనసేన లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మంగళగిరి-నారా లోకేష్,పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర,చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ, వినుకొండ – జి.వి.ఆంజనేయులు, గురజాల – యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, వేమూరు – నక్కా ఆనంద బాబు, పర్చూరు – ఏలూరి సాంబశివ రావు, ఒంగోలు – దామెచెర్ల జనార్దన్,కొండెపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి – ఉగ్ర నరసింహ రెడ్డి, కోవూరు – పోలం రెడ్డి దినేష్ రెడ్డి,ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి, నగిరి – గాలి భానుప్రకాష్, పలమనేరు – అమరనాథ్ రెడ్డి, పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లి – పర్వీన్ తాజ్,మదనపల్లి – రాటకొండ మధుబాబు, రాయచోటి – ద్వారకానాథ రెడ్డి, జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి, మైదుకూరు-పుట్టా సుధాకర్, పులివెందల-బీటెక్ రవి, నంద్యాల – ఎన్‌ఎండి ఫరూక్, బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి,ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ, పాణ్యం – గౌరు చరిత రెడ్డి, శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు – టీజీ భరత్, ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి, ఆదోని – పరిటాల సునీత, ఉరవకొండ – పయ్యావుల కేశవ్, తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు, హిందూపురం – నందమూరి బాలకృష్ణ,కదిరి – కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నారు.

ఇక టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇచ్ఛాపురం – బెందాళం అశోక్, టెక్కలి – అచ్చెనాయుడు, ఆముదాలవలస – కూన రవికుమార్, పలాస – గౌతు శిరీష, రాజం – కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి – బేబీ నాయన, విజయనగరం – అశోక గజపతి రాజు, చీపురుపల్లి – కిమిడి నాగార్జున, కురుపాం – టి.జగదీశ్వరి, పార్వతీ పురం – బి. విజయచంద్ర, వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణ బాబు, వైజాగ్ (పశ్చిమ) – గణబాబు, పాయకరావుపేట – అనిత,నర్సీపట్నం – చింతకాయల విజయ్, తుని-యనమల దివ్య,జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం – చినరాజప్ప, అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి,రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు, గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు, ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు, అమలాపురం – బత్తుల ఆనందరావు, మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు,నిడదవోలు – బూరుగుపల్లి శేషారావు, ఆచంట – తండ్రి సత్యనారాయణ, పాలకొల్లు – నిమ్మల రామానాయుడు, ఉండి – మంతెన రామరాజు, దెందులూరు – చింతమనేని ప్రభాకర్, విజయవాడ తూర్పు-గద్దె రామ్మోహనరావు, విజయవాడ (సెంట్రల్) – బోండా ఉమ, నందిగామ – తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం – కొల్లు రవీంద్ర,గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు,పెనమలూరు-బోడే ప్రసాద్ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -