ఆరోగ్య శ్రీపై కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేసిన షర్మిల..సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన ఈ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టారన్నారు. అంతేగాదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్కి కూడా ఆరోగ్యశ్రీనే ఆదర్శమన్నారు. ఇలాంటి పథకాన్ని నీరు గార్చాలని చూడటం సరికాదన్నారు.
ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల… ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? అనుమానం కలుగుతోందన్నారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసేందుకే పెండింగ్ నిధులు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు.
బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? అన్నారు. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? అని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్లో ఉన్న ఆరోగ్య క్ష రూ.1600 కోట్ల రూపాయలను విడుదల చేయాలన్నారు.