త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన చిత్రం ”అత్తారింటికి దారేది ”. ఈ సినిమాలో ఈ ఇద్దరు జోడిగా నటించి మంచి మార్కులే కొట్టేశారు. మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది.
అవును పవన్తో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ ని తీసిన ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఖుషీ సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. సో ఈ చిత్రంలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట పవన్. ఒక సమంత కూడా పవన్ తో మరో సారి నటించడానికి ఎదురు చూస్తుంది.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నాడు. పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా తెరకెక్కిందని ఈ చిత్ర యూనిట్ అంటుంది. ఇదే నెలలో ఆడియో రిలీజ్ చేసి వచ్చే నెల సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.