విశాఖ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లోగా విశాఖకు షిఫ్ట్ అవుతానని..ఇకపై పాలనంతా విశాఖ నుండే సాగుతుందన్నారు. ఐటీ హబ్గా విశాఖను మారుస్తానని తెలిపిన జగన్..ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా మారిందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం..అందుకే పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందన్నారు. అభివృద్ధిలో విశాఖ నగరం శరవేగంగా దూసుకుపోతోందని..పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ఒక్క ఫోన్ కాల్ తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామని చెప్పారు. దీంతో జగన్ విశాఖ వేదికగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
ఇక విశాఖ పర్యటన సందర్భంగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేశారు.