చంద్రబాబు, పవన్ పై మరో సారి విరుచుకు పడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చికొడితే ఎక్కడో పడిన చంద్రబాబు హెచ్చరికలు ఒకేలా ఉన్నాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.‘మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని బాబుగారు గగ్గోలు పెడుతున్నాడు’అని ఎద్దేవా చేశారు.
అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీపై ఓ పక్క పచ్చ పార్టీ నేతలు, మరోపక్క తోక పార్టీ జనసేన నేతలు పసలేని విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారని మండి పడ్డారు.గెలుపు కోసం ఎంతో కృషి చేసినా.. ఎందుకు ఓడిపోయామో తెలియదంటూ చంద్రబాబు, ఎన్నికల్లో అక్రమాల వల్లే వైఎస్సార్సీపీ గెలిచిందని పవన్ ఇటీవల అడ్డగోలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపైనె విజయసాయి విమర్శలు ఎక్కు పెట్టారు.యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనరేమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. మరి టీడీపీ గెలిచిన ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్నర్ను ఎవరు గెలిపించారో? అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.