గ్రేటర్ హైదరాబాద్ నూతన మేయర్గా ఎన్నికైన విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ జంట నగరాల్లో పెట్టిన ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. జూబ్లీహిల్స్లో అనధికారికంగా ఫ్లెక్లీ ఏర్పాటు చేశారని… తెరాస నాయకులు అతిష్ అగర్వాల్కు రూ. లక్ష రూపాయలను ఈవీడీఎం అధికారులు జరిమానా విధించారు. మిగతా చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం జీహెచ్ఎంసీ, ఈవీడీఎం సిబ్బంది తొలగిస్తున్నారు.
అయితే అనధికారికంగా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పెట్టారు. ఇది చూసిన జీహెచ్ఎంసీ, ఈవీడీఎం అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు.
గతంలో ఇలాంటి ఫ్లేక్సీలు ఏర్పాడు చేసినందుకు గాను భారీ జరిమానాలు విధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ ఫ్లెక్సీలు పెట్టకూడదని మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.