కరోనా భయంతో దేశ వ్యాప్తంగా ఎంటర్ టైన్ మెంట్ కి దూరమైన ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్లో చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ పాయింట్ అయింది.
విడుదలవ్వక ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను మించి సరికొత్త రికార్డులతో దుమ్ము లేపింది. ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్ లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వరుసగా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబట్టింది. కృష్ణా జిల్లాలో రూ.0.62 కోట్లు, గుంటూరులో రూ.0.65 కోట్లు, నెల్లూరులో 0.35 కోట్లు రాబట్టింది.
ఆంధ్రాలో మొత్తం కలిపి రూ.4.87 కోట్లు రాబట్టింది. నైజాం, ఏపీలో కలిపి మొత్తం రూ.9.3 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో రూ.52 లక్షలు, తమిళనాడులో రూ.16 లక్షలు, ఓవర్ సీస్లో రూ.34 లక్షలు రాబట్టింది.