వెస్టిండీస్తో గౌహతి వేదికగా జరిగిన ఒన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇండీస్ నిర్దేశించిన 322 పుగల లక్ష్యాన్ని భారత్ 42.1 ఛేదించారు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగారు. 323 పరుగుల లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లి (140: 107 బంతుల్లో 21×4, 2×6) – రోహిత్ శర్మ (152 నాటౌట్: 117 బంతుల్లో 15×4, 8×6) జోడి రెండో వికెట్కి అభేద్యంగా 246 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
మ్యాచ్లో ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్లో రోహిత్ శర్మ కొట్టిన ఫోర్.. అభిమానులనే కాదు.. నాన్స్ట్రైక్ ఎండ్లోని కెప్టెన్ కోహ్లీని కూడా ఫిదా చేసింది. లెగ్స్టంప్ని టార్గెట్గా చేసుకుని రోచ్ బంతిని విసరగా.. కొద్దిపాటి పాదాల కదలికతో మిడిల్ స్టంప్ లైన్పైకి వెళ్లిన రోహిత్ శర్మ కళ్లుచెదిరే రీతిలో ప్లిక్ చేశాడు. బ్యాట్ చక్కగా మిడిల్ కావడంతో.. నేరుగా వెళ్లిన బంతి బౌండరీ లైన్కి సమీపంలో పడింది. ఈ షాట్ చూసి నాన్స్ట్రైక్ ఎండ్లోని కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు.
https://twitter.com/NaaginDance/status/1054004334923599874