Saturday, May 18, 2024
- Advertisement -

ఈసారి జనసేన నుండి రఘురామ!

- Advertisement -

రఘురామ కృష్ణంరాజు(ఆర్ఆర్ఆర్) ఈ సారి జనసేన నుండి బరిలోకి దిగనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన రఘురామ కృష్ణంరాజు తర్వాత రెబల్‌గా మారారు. టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే రఘురామ ఎన్ని విమర్శలు చేసినా సీఎం జగన్, వైసీపీ శ్రేణులు ఆయన్ని లైట్ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సారి రఘురామ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే సందేహం నెలకొనగా ఆయన మాత్రం జనసేన నుండి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో జనసేన నుండి పోటీ చేస్తే కలిసి వస్తుందని భావిస్తున్నారు రఘురామ.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు పవన్. ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనాని పవన్‌తో భేటీ అయిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారట. గతంలో నరసాపురం నుండి వైసీపీ తరపున రఘురామ పోటీ చేయగా నాగబాబు జనసేన నుండి పోటీ చేశారు. అయితే ఈసారి రఘురామ జనసేన నుండి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు కాకినాడ నుండి పోటీ చేస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -