- Advertisement -
రేపు ఆగస్టు 1న ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో రూ. 17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి (Semiconductor Manufacturing Facility) ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
కర్ణాటక టూర్ సందర్భంగా మైసూర్లోని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో నిర్మించిన స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం – ‘వివేక స్మారక’ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తికాగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

