- Advertisement -
మొహాలీ వేదికగా హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకూ టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ లక్ష్య చేధనకే మొగ్గు చూపగా.. అశ్విన్ మాత్రం ముందుగా బ్యాటింగ్ చేయడానికే సిద్ధపడ్డాడు. సొంత గడ్డ మీద బలమైన చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న సన్రైజర్స్తో పోటీకి సిద్ధ పడుతోంది. సన్రైజర్స్కి బౌలింగ్ ప్రధాన బలం కాగా.. పంజాబ్ బ్యాట్స్మెన్ దూకుడు మీదున్నారు.