భారత ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెస్టు సిరీస్లో 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను రెండు సార్లు సాధించిన తొలి భారత బౌలర్గా నిలిచాడు.
ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ చివరి టెస్టులో ఈ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్లో రూట్ వికెట్ తీసి.. సిరీస్లో 30 వికెట్ల మైలురాయిని చేరాడు.అంతకుముందు 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో 31 వికెట్లు పడగొట్టాడు.సుదీర్ఘ ఫార్మాట్లో 400పైచిలుకు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్ అశ్విన్. ఇటీవలే మూడో టెస్టు అనంతరం.. బౌలర్ల ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి ఎగబాకాడు యాష్.
భారత మాజీ బౌలర్లు బిషన్ సింగ్ బేడీ, హర్భజన్ సింగ్, బీఎస్ చంద్రశేఖర్, కపిల్ దేవ్లు.. టెస్టు సిరీస్లో 30 వికెట్ల ఘనతను ఒక్కోసారే అందుకున్నారు. తాజాగా అశ్విన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
అభిమాని చెంప ఛెల్లుమనిపించిన బాలకృష్ణ.. ఎందుకో తెలుసా?
ఎంపీ, ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కోర్టు.. అందుకేనా?
భారతీయులపై నేపాల్లో కాల్పులు.. పోలీసులు చెప్పిన కారణం ఏమిటి అంటే…!