- Advertisement -
ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’.ఈ సినిమాకు లీకుల బెడద ఎక్కువైంది.ఇప్పటికే నాగబాబు ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వగా తాజాగా మరన్ని ఫోటోలు లీక్ కావడంతో సినిమా యూనిట్ అందోళనలో ఉంది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ స్టిల్ ఒకటి ఇటీవల లీక్ కాగా, తాజాగా అదే సీన్కు సంబంధించి మరిన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
లీకులు ఎవరు చేస్తున్నారన్న దానిపై మూవీ యూనిట్ దృష్టిసారించినట్లు సమాచారం.. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా పూజా హెగ్డే,ఈషా రెబ్బాలు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.మరి ఈ లీకుల నుండి ఈ సినిమా ఎలా బయట పడుతుందో చూడాలి.