Monday, May 6, 2024
- Advertisement -

ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ ఆత్మహ‌త్య‌

- Advertisement -

బాలీవుడ్‌లో ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ అభిజీత్ షిండే ఆత్మహత్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేశాడు అభిజీత్ షిండే.తన నివాసంతో ఫ్యాన్ సీలింగ్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు షిండే. అతడు చనిపోయిన చోట పోలీసులకు సూసైడ్ లెటర్ దొరికింది. అందులో తన బ్యాంకు ఖాతాను తన కూతురి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని ఉంది.

షిండే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు షిండే.ఇప్పుడు అతడు ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలలుగా డిప్రెషన్ లో ఉంటోన్న అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అంచనా వేస్తున్నారు. అభిజీత్ షిండే ఆత్మహత్యపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -