- Advertisement -
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తుండగా ఆ తర్వాత ఉప్పెన బుచ్చిబాబుతో సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పారట రామ్ చరణ్. ఇప్పుడు ఇదే వార్త టీ టౌన్లో వైరల్గా మారింది.
బాలీవుడ్ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేసేందుకు ఈ మధ్యే సైన్ చేశాడనే గాసిప్స్ వస్తుండగా ఆ దర్శకుడు ఎవరన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంచారు. అయితే టాలీవుడ్ లీక్ల ప్రకారం సంజయ్ లీలా భన్సాలీ లేదా రాజ్ కుమార్ హిరాణీలలో ఒకరు అయి ఉంటారని టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ ఈ మధ్య ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో బీ టౌన్లోనూ రామ్ చరణ్ రాణించడం పక్కా అని తెలుస్తోండగా ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు చెర్రీ.