హీరో నాగచైతన్య ఇటీవలే శైలాజ రెడ్డి అల్లుడితో డిసెంట్ కొట్టాడు. ఈ సినిమా తరువాత చైతు నటిస్తున్న సినిమా సవ్యసాచి.వెరైటీ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్కు ,సాంగ్స్కు మంచి స్పందన వచ్చింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.’ప్రేమ,కోపం లాంటి ఎమోషన్స్ మీకొస్తే.. మీరు మాత్రమే రియాక్ట్ అవుతారు.. అదే నాకొస్తే నాతో పాటు ఇంకొకడు కూడా రియాక్ట్ అవుతాడు.. నా ఎడం చేయి..’ అంటూ చైతు చెప్పే డైలాగ్ అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది.
నాగచైతన్యని చూస్తూ సినిమాలో విలన్ మాధవన్ ‘వాడిని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఉన్నాడు కదూ..’ అని తాగుబోతు రమేష్ తో అనగా దానికి అతడు ‘మీది పద్మవ్యూహమే సర్ కానీ అతడిని చూస్తుంటే అభిమన్యుడిలా కాదు.. అర్జునుడిలా ఉన్నాడు’ అంటూ చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి. ‘చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడం చేయి దాటి నిన్ను రావాలి..’ అంటూ రావు రమేష్ పలికిన డైలాగ్ సినిమాలో హీరో పాత్ర ఎంత బలంగా ఉండబోతుందే తెలిసేలా చేస్తుంది. ‘సవ్యసాచి’ అంటూ సాగే నేపధ్య సంగీతం ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది.ట్రైలర్ను చూస్తుంటే చైతు మరో హిట్ కొట్టినట్లే అనిపిస్తుంది.బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.సినిమాను నవంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.