- Advertisement -
శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో ఓ ప్రముఖ హీరో ఫుల్లుగా మధ్యం తాగి కారు నడుపుతూ పట్టుబడ్డాడు.ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు – ప్రముఖ నటుడు మనోజ్ బుక్ అయ్యారు. పోలీసులు వాహనాల తనీఖీల్లో భాగంగా మనోజ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో వచ్చారు. ఆయన మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కారును సీజ్ చేసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మనోజ్ 1999లో ఆయన తండ్రి దర్శకత్వంలో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మనోజ్ చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు.