అక్కినేని వారసుడు యువ హీరో అఖిల్ ఎప్పడు ఫుల్ జోష్లో ఉంటాడు.హీరోలందరితో కలిసి పోతుంటాడు.ప్రస్తుతం తను హీరోగా నటించిన హాలో సినిమా ప్రమోషన్స్లో బిజీ,బిజీగా ఉన్నాడు.తాజాగా ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో తన బ్యాచిలర్ లైఫ్ గురించి,తన బ్యాచ్ గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు చేప్పాడు అఖిల్.ఎప్పుడైనా పార్టీ చేసుకుంటే ఆ పార్టీకి ఎవరెవర్ని పిలుస్తారు అనే ప్రశ్నకు ఓపెన్గా సమాధానం చెప్పాడు.
`నేను పార్టీ ఎప్పుడు చేసుకున్నా అక్కడ రానా ఉండాల్సిందే. మేమిద్దరం ఎప్పుడు పార్టీ చేసుకున్నా ఎక్కువగా ప్రభాస్ గురించే మాట్లాడుకుంటాం. ప్రభాస్ కూడా పార్టీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇక, రానాకు, నాకు రామ్చరణ్ క్లోజ్ ఫ్రెండ్. నేనెప్పుడు పార్టీ ఎరేంజ్ చేసినా రామచరణ్కు కచ్చితంగా కాల్ చేస్తా. మేమంతా కూల్గా పార్టీని ఎంజాయ్ చేస్తాం. ఒకవేళ పార్టీలోకి సాయిధరమ్, మంచు మనోజ్ వచ్చారంటే మాత్రం అక్కడంతా రచ్చ రచ్చ అయిపోతోంది. వారిద్దరూ తెగ అల్లరి చేస్తార`ని అఖిల్ చెప్పాడు.