- Advertisement -
మొదటి చిత్రం పిల్లానువ్వులేని జీవితం సినిమాతో మంచి మార్కులు కొట్టెసాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాతో సాయి 20 కోట్ల వసూళ్లను రాబట్టి తన మార్కెట్ స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన రేయ్ సినిమా ప్లాప్ అయిన మూడవ సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ తో రిసేంట్ గా డీసెంట్ హిట్ అందుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ సినిమాతో పాతిక కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు అదే జోరు సుప్రీం సినిమాతో 40 కోట్లపై కన్నేశాడు.
పటాస్ లాంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి డైరెక్షన్ లో సప్రీమ్ అనే సినిమా లో నటిస్తున్నాడు ధరమ్ తేజ్. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలు ఉండటం వల్ల ఈ సినిమాతో సాయి 40 కోట్ల వసూళ్లు చేస్తాడు అని అంటున్నారు