అఖిల్ అక్కినేని పెళ్ళి గురించి ఇప్పుడు టాలీవుడ్ ఫిలింనగర్ లో షాకింగ్ రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే జీవికే ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మధ్య వియ్యం కుదిరిన విషయం తెలిసిందే. జీవీకే మనవరాలిని అక్కినేని అఖిల్ ప్రేమించడంతో వారిద్దరి పెళ్లికి పెద్దలు పచ్చజెండా ఊపడమే కాకుండా అత్యంత వైభవంగా వారి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఆ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు విపరీతంగా మీడియాకు కూడ విడుదల చేసారు.
అయితే మరి కొద్దిరోజులలో అఖిల్ మ్యారేజ్ జరగబోతోంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమధ్య అఖిల్ శ్రియ భూపాల్ ల పెద్దలు ఈమధ్య సమావేశం అయి ప్రశాంతంగా చర్చించుకుని, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అఖిల్ శ్రియల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు అని అంటున్నారు. పెళ్లి తర్వాత ఇబ్బంది పడేకన్నా.. ఈ భేధాభిప్రాయాల మధ్య విడిపోవడమే మంచిదని ఆలోచనలతో ఇరు వర్గాలు వారు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ పెళ్లిని ఇటలీలో జరిపించాలనుకున్నారు. రెండు ఫ్యామిలీలకు సంబంధించిన సుమారు 100 మందికి ఎయిర్ టిక్కెట్స్ హోటల్ ఎకామిడేషన్ ఇప్పటికే బుక్ చేసారు. వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయున క్రమంలో ఇటలీ ట్రిప్ కు సంబంధించిన ఎయిర్ టిక్కెట్స్ తదితర విషయాలను కూడ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఘాడంగా లవ్ చేసుకున్న వీరిద్దరూ.. ఇలా విడిపోయారు అనే వార్త రావడం.. అదరికి షాకింగ్ గా మారింది.
{youtube}f6rrHoZEzr0{/youtube}
Related