మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ కు అక్కినేని ఫ్యామిలీలోని అఖిల్ కు చుట్టరికం కలిసింది. ఇద్దరు బావ మరుదులు అవుతారని ఓ కథనం. లేదు ఇంకేదో బంధుత్వం ఉందని కూడా టాలీవుడ్ లో టాక్. వరస ఏదైనా బంధుత్వం మాత్రం పక్కా అయిందని సమాచరం.
అయితే మెగా ఫ్యామిలీకి.. అక్కినేని ఫ్యామిలీకి ఎలా చుట్టరికం కుదురింది..? చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి చెందిన ప్రతాప్ రెడ్డికి స్వాయాన మనవరాలు. అలా రామ్ చరణ్ అపోలో వారి ఇంటి అల్లుడయ్యాడు. ఇక అక్కినేని అఖిల్ చేసుకోబోయే శ్రియా భూపాల్ వ్యాపారవేత్త జీవీకే సంస్థల అధినేత జీవీకే రెడ్డి మనవరాలు. అంటే అఖిల్ కూడా పెద్దింటి వారికే అల్లుడు కాబోతున్నాడు. ఆ తర్వాత రెండో అంశం ఉపాసన, శ్రియా ఇద్దరు రెడ్డి సమాజిక వర్గానికి చెందినవారే.
ఇక అసలు విషయంలోకి వస్తే.. ఉపాసన తరుపు నుంచి శ్రియా కుటుంబంకు బంధుత్వం ఉందట. ఉపాసనకు శ్రియా మరదలు వరస అవుతుందని టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అంటే ఉపాసన, శ్రియా ఇద్దరు మరదలు అయితే.. చెర్రీ, అఖిల్ బావ మరుదులు వరస అవ్వడం నిజమే కదా.. సో అసలు సంగతి.
Related