మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.తన కుటుంబసభ్యుల పేర్లతో ముగ్గురిని అక్రమంగా అమెరికాకు తరలించిన కేసులో జగ్గారెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్పోర్టు పొందిన కేసులో పోలీసులు నిన్న ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 420, 467, 468, 471, 370 సెక్షన్లతో పాటు పాస్పోర్టు చట్టం 1967 సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశారు.
2004 ప్రాంతలో నకిలీ ధ్రువపత్రాలతో ముగ్గురిని అమెరికాకు అక్రమంగా పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భాగంగా జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.