- Advertisement -
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతలంతా ఎవరికి వారే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండగా తాజాగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని వచ్చే పదేళ్లలో సీఎం అవుతానని తేల్చి చెప్పారు. సంగారెడ్డిలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ వల్ల తన నోరు, చేతులు కట్టి పడేసినట్లు అయిందని, లేదంటే మరిన్ని విషయాలను చెప్పే వాడినని అన్నారు.
ఇక పలువురు కాంగ్రెస్ నేతలు తామే సీఎం అభ్యర్థి అని బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు. తాజాగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపగా మరి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి..