ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం ఆమె అభిమానులతో పాటు సెటబ్రటీస్నుకూడ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణంపై అనేకమంది ప్రముఖులు స్సందించారు. తాజాగా గూగుల్ సీఈవో సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్లో స్పందించారు. ఆమె మకరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీదేవి ఓ మార్గదర్శకురాలని, తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తాను అభిమానించే శ్రీదేవి సినిమాల్లో ‘సద్మ’ ఒకటని… తన కుటుంబంతో కలసి చూసినప్పటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని చెప్పారు.
భార్యను కోల్పోయిన దు:ఖంలో అందరినీ ఉద్దేశించి బోనీ కపూర్ ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అందులో బోనీ ఆవేదన చూసి, అందరూ కదిలిపోయారు. ఈ నేపథ్యంలో, బోనీ లేఖకు రిప్లై ఇస్తూ, సుందర్ పిచాయ్ పై విధంగా స్పందించారు.
Her performance in Sadma was one of my favorites and have special memories of watching Sridevi with my family. She was a pioneer and an inspiration to so many of us. So very sorry for your tragic loss and may she RIP
— Sundar Pichai (@sundarpichai) March 2, 2018