దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద అందరికీ ఎన్నెన్నో సమాధానాలు ఉన్నాయి. ఆమెకి అందించిన చికిత్స వివరాలు అపోలో ఆసుపత్రి వర్గాలు ఇప్పటివరకూ అందించనే లేదు. ఆమె ఎప్పుడు చనిపోయారు అనే విషయం మీద చిన్న క్లారిటీ కూడా లేదు ఇప్పటి వరకూ.
దీనికి తోడూ జయ చికిత్స కి ఖర్చి అయిన వివరాల గురించీ వివాదం నడుస్తోంది. హై ఫీవర్, డీహైడ్రేషన్ తో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు 75 రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు. ఈ చికిత్సకుగాను అపోలో యాజమాన్యం రూ. 90 కోట్ల బిల్లును వేసిందని… ఆరోగ్య పథకాలకు సంబంధించిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
అయితే, ఈ వార్తలను అపోలో వైద్యులు ఖండిస్తున్నారు. జయ చికిత్సకు రూ. 90 కోట్లు ఖర్చుకాలేదని… అయితే, కొన్ని కోట్ల రూపాయలు మాత్రం ఖర్చయ్యాయని తెలిపారు. ఎంత ఖర్చయిందో స్పష్టంగా చెప్పకుండా, కొన్ని కోట్లు అంటూ డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తూ, జనాలను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మరోవైపు, చికిత్స బిలులను చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఇంకా కోరలేదని వైద్యులు తెలిపారు.