తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడులోని ఊటీకి సమీపంలో నీలగిరి అటవీ ప్రాంతంలోని కూనూర్ సమీపంలో ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాఫ్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్లో 14 మంది ఉన్నట్లు సమాచారం.
ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ కుటుంబ సమేతంగా ఢిల్లీ నుంచి తమిళనాడుకు వెళ్తున్న హెలికాఫ్టర్ కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఒక్క సారిగా ప్రమాదం జరిగనట్లు అధికారులు తెలిపారు. ఐతే 14 మంది ప్రయాణిస్తున్న ఈ హెలికాఫ్టర్లో 13 మంది అక్కడి కక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన రావత్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రమాద విషయం తెయడంతో ప్రధాని మోడీ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ ప్రమాదం గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో చర్చించారు. రేపు ఘటనా స్థలానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెళ్లనున్నారు. అనంతరం ఆయన ప్రమాదానికి సంభందించి పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు.
భరువు తగ్గనున్నా గ్యాస్ సిలిండర్.. కేంద్రం మరో కీలక నిర్ణయం..?