Saturday, April 27, 2024
- Advertisement -

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నదని భార్య చేసిన పని తెలిస్తే షాకే !

- Advertisement -

భార్య భర్తల మద్య తరుచూ చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ ఆ గొడవలు శృతిమించినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. అయితే బార్యభర్తల మద్య గొడవలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అక్రమ సంబంధలే ప్రధాన సమస్య అని చెప్పవచ్చు. ఇలా అక్రమ సంబంధాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం లేదా ఇరు కుటుంబాలు దాడులకు పాల్పడడం వంటివి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన బార్యలు లేదా భర్తలు సమాజంలో చాలా మందే ఉన్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే తన భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బార్య దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా భర్త మర్మాంగంపై వేడి వేడి నీటిని పోసి దాడి చేసింది. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా కావేరిపాకం లో చోటు చేసుకుంది. తుంగరాజ్, ప్రియా అనే ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే భర్త ( తుంగరాజ్ ) కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రాకపోవడం, కుటుంబ అవసరాలను పట్టించుకోకపోవడంతో బార్య ( ప్రియా ) ను అనుమానం వచ్చింది. దాంతో భర్త కదలికలను అరా తీసిన ప్రియాకు తన భర్త వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో కోపంతో రగిలిపోయిన ప్రియా తన భర్త మర్మాంగంపై మరుగుతున్న నీటిని పోసి దాడి చేసింది. దాంతో తుంగరాజ్ మర్మాంగం చుట్టూ ఉన్న భాగం 40 ష్టం వరకు కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చర్యలు చేపట్టారు.

Also Read : చైనా నౌక విషయంలో.. భారత్ ఆందోళన

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -