- Advertisement -
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ల్లో తిరుగులేని విజయం సాధిస్తున్న అన్నాడిఎంకె అధినేత జయలలిత, టిఎంసి నాయకురాలు మమతా బెనర్జీలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఎన్నికల కమిషన్ అధికారికంగా ఫలితాలను ప్రకటించనప్పటికి ఫలితాల తీరు చూసిన ప్రధాని వారిద్దరిని అభినందిస్తూ ట్వట్టర్ పేర్కొన్నారు. తాను జయలలిత, మమతా బెనర్జీలతో ఫోన్ లో మాట్లాడానని ప్రధాని ఆ ట్విట్ లో తెలిపారు.
వారిద్దరు ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అని ప్రధాని తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావు కూడా ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.