కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉప్పెనలా విస్తరిస్తున్న తరుణంలో.. విమాన సర్వీసులను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్లో చిక్కుకుపోయారు. దీంతో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సమయంలో స్వదేశానికి రావాలనుకున్న వారంతా ఆందోళన చెందుతున్నారు.
చాలా మంది విద్యార్థులు జనవరి ప్రారంభానికి ముందే స్వదేశానికి చేరుకుని సెలవు కాలంలో కుటుంబాలతో గడపాలనుకున్నారు. అయితే బ్రిటన్లో ఇరుక్కుపోవడం వల్ల వారి పరిస్థితి అయోమయంగా ఉంది,” అని యూకే జాతీయ విద్యార్థి యూనియన్ ఛైర్పర్సన్ సనన్ అరోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లండన్లోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమాల వేదికగా భారత పౌర విమానయాన శాఖకు పలు సందేశాలను పంపుతోంది.
ముందస్తు జాగ్రత్త చర్యగా బ్రిటన్ విమానాలపై మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకు నిషేధం విధించింది భారత్. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.