- Advertisement -
నోబెల్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పురస్కార ప్రదానోత్సవాన్ని ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా వర్చువల్గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు నార్వే నోబెల్ కమిటీ అధికారులు.
డిజిటల్గా జరిగే ఈ వేడుకల్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఓస్లేలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది నోబెల్ కమిటీ.
నోబెల్ బహుమతి ప్రదానోత్సవాన్ని నార్వే రాజధాని ఓస్లో లోని సిటీ హాల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. అక్కడ ప్రస్తుతం మహమ్మారి ఉద్ధృతి కొనసాగతున్నందున తాజా నిర్ణయం తీసుకుంది నోబెల్ కమిటీ. పురస్కార వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా.. ఏటా డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.