- Advertisement -
తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,078 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 331 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం 6900 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితుల హోం ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులు అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 283 ఉన్నాయి. శుక్రవారం ఒకే రోజు 59,705 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819కి చేరింది.
నేటి పంచాంగం, శనివారం(3-4-2021)