ఎన్డీ తివారి కొడుకు రోహిత్ తివారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఎన్డీతివారీ తనయుడు అనుమాస్పద స్థితిలో ఇటీవలే మరణించారు. చాలా తొందరగానే ఈ కేసు వెనుక మిస్టరీని చేధించారు ఢిల్లీ పోలీసులు. రోహిత్ను చంపింది అతని భార్య హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శేఖర్ హత్యానంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న పోటీసులు విచారించి అసలు విషయాన్ని బయటపెట్టారు.
మూడురోజుల పాటు రోహిత్ భార్య అపూర్వను విచారించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ మరణించిన రాత్రి అతని గదిలోనే అపూర్ ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. గతకొన్ని రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా పేర్కొంది. రోహిత్ మద్యం మత్తులో ఉన్న సమయంలో అతని ముఖంపై దిండుతో ఒత్తి ఊపిరాడకుండా చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వివాహం విషయంలో శేఖర్ తివారీ భార్య అసంతృప్తితో ఉండేదని, అందుకే ఆమె భర్తను హత్య చేసిందన్నారు.
ఖర్ ను హత్యచేసి తొంభై నిమిషాల పాటు ఆమె సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేసిందని, అనంతరం అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.ఏప్రిల్ 16న తన నివాసంలోనే రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.