- Advertisement -

ప్రదీప్ రావత్ ఆస్తుల విలువెంతో తెలుసా?

- Advertisement -

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్‌ రావత్ (74). ఆయ‌న గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్, బాలీవుడ్‌ సహా పలు సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

దిల్లీలో జన్మించి ముంబైలో స్థిరపడిన ప్రదీప్‌ రావత్ నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణాన్ని సాగించారు. ‘స్టాలిన్‌’ సినిమా షూటింగ్ సమయంలో కాకినాడకు చెందిన కళ్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు (కొన్ని నివేదికల ప్రకారం ఇద్దరు కుమారులు) ఉన్నారు. ఆయన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో రోజుకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పారితోషికం తీసుకునేవారని సమాచారం. సినీ పరిశ్రమలో ఆయన సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ. 41 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెరపై క్రూరమైన విలన్‌గా కనిపించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆయన ఎంతో సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు భారతీయ సినిమా పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

హిందీలో అప్పట్లో సంచలనం సృష్టించిన ‘లగాన్‌’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ‘భిక్షూ యాదవ్‌’ పాత్రతో ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టారు. ఈ నటనకు గాను ఆయన ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘భద్ర’, ‘ఛత్రపతి’, ‘దేశముదురు’, ‘లక్ష్మి’, ‘నాయక్’, ‘బాద్‌షా’, ‘సరైనోడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం విలన్ పాత్రలే కాకుండా ‘పూలరంగడు’, ‘నేను శైలజ’ వంటి చిత్రాల్లో హాస్య, సహాయ పాత్రలతోనూ కడుపుబ్బా నవ్వించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం తదితర భాషల్లో కలిపి సుమారు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానమే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆయన తరచూ చెబుతుండేవారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -