Monday, May 12, 2025
- Advertisement -

నేటి నుంచే జ‌గ‌న్ రైతు దీక్ష‌

- Advertisement -
Ys Jagan To Launch Rythu Deeksha

2014 ఎన్నిక‌ల్లో రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డంతో జ‌గ‌న్ మ‌రోసారి రైతుదీక్ష‌కు పూనుకున్నారు. పంట రుణాలు మాఫీ కాక, పండించిన పంటలకు మద్దతు ధరల్లేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి రెండు రోజులపాటు ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్‌ జగన్‌ రైతు దీక్షకు పూనుకుంటున్నారు.

ప్ర‌తి కూట వర్షాభావ పరిస్థితులను ఎద‌రుర్కొని , కష్టపడి పండించిన పంటలను మార్కెట్‌ యార్డులకు తరలిస్తే మద్దతు ధరలు దక్కడం లేద‌ని రైతులు వాపోతున్నారు. రైతులు కష్టాల్లో లంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యచూస్తూ … పంట‌లు మద్దతు ధర కల్పించి రైతన్నల్లో భరోసా పెంచాల్సింది పోయి కుంటిసాకులతో కాలం గడుపుతోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ‘ధరల స్థిరీకరణ నిధి’కి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోద‌కాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష తలపెట్టారు. ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం వచ్చి, తమను ఆదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో నూ ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి, పసుపు, ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలకు కనీస మద్దతు ధరలు లభించక రైతన్నలు ఆర్థికంగా దిగజారిపోతున్నారు. పంటల సాగు కోసం బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను బేషర తుగా మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాక ఆ హామీకి పాతరేశారు. మూడేళ్లుగా రుణాలను మాఫీ చేయకుండా రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచారు.
జగన్‌ ఉదయం 10.30 గంటలకు రైతు దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. రైతు దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ప్రైవేటు ప్రాంగణంలో దీక్ష జరగనుంది. ప్రధాన వేదిక, రైతన్నల కడగండ్లపై కళాకారుల ప్రదర్శనకు మరో వేదిక నిర్మాణం పూర్తయ్యాయి. పార్టీ ముఖ్యులు, రైతులు, ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ దీక్ష‌తోనైనా ప్ర‌భుత్వం క‌ల్ల తెర‌వాల‌ని రైతులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Related

  1. 2019 ఎన్నిక‌లే టార్గెట్‌గా వేగంగా పావులు క‌దుపుతున్న జ‌గ‌న్
  2. 2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ బాహుబ‌లి.. లోకేష్ ఒక క‌మెడియ‌న్
  3. ప్ర‌శాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జ‌గ‌న్ ప‌క్కావ్యూహం..
  4. ఈనెల 28 తేల‌నున్న జ‌గ‌న్ భ‌విష్య‌త్తు….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -