ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నీ పార్టీలు గెలుపు గుర్రాలకోసం వేటను ప్రారంభించాయి.వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం ఇప్పటి నుంచే అస్త్ర,శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
గత ఎన్నిఎన్నికల్లో కేవలం 5లక్షల ఓట్లతో అధికారాన్ని కోల్పోయిన జగన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి తన సర్వశక్తులను ఒడ్డుతున్నారు. నియేజక వర్గాల వారిగా అంచనా వేస్తూ పార్టీ బలంగా ఉన్న చోట బలమైన నాయకులను పోటీలో దింపాలని వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.ముఖ్యంగా కోస్తాజిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్న మాటవాస్తవమే. అయితే అక్కడ పట్టుపెంచుకొనేందుకు జగన్ భారీ స్కెచ్నే వేస్తున్నారు.
గోదావరి జిల్లాలలో బలమైన నాయకులుగా ఉన్న ఉండవల్లి అరుణ్కుమార్,కాంగ్రెస్ సీనియర్నేతలను, బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు ముద్రగడను బరిలోకి దింపాలని చూస్తున్నారు.పశ్చిమ గోదావరిలో కోటగిరి విద్యాదర్రావు కొడుకు కోటగిరి శ్రీధర్ను చేర్చుకొని ద్వారకా తిరుమలలోపోటీచేయబోతున్నారు.ఇక గుంటూరు జిల్లాలో కాసు కుటుంబంనుంచి కాసు మహేష్ను చేర్చుకున్న జగన్..మాజీ మంత్రి కన్నాలక్ష్మినారాయన కుటుంబాన్ని కూడా పార్టీలోకి చేర్చుకొనేందుకు జగన్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని ప్రాంతంనుంచి టాలీవుడ్ స్టార్ హీరో ను వైసీపీ తరుపు బరిలో దించేందుకు జగన్ ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్టార్ హీరోతో దగ్గర సంబంధం ఉన్న చిరంజీవికూడా రాజకీయాల్లోకి రావాలని కోరినట్లు తెలుస్తోంది.వైఎస్ కుంటుంబంతో సన్నిహిత సంబందాలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలన్న జగన్ ఆఫర్ని కాదనలేక పోతున్నట్లు సమాచారం.ఎన్నికల ముందు రాజధాని ప్రాంతంలో స్టార్ హీరో పోటీచేసె విషయాన్ని ప్రకటిద్దామని జగన్ భావిస్తున్నట్లు సమాచరాం. ఆహీరో సొంతజిల్లా కృష్ణజిల్లా కావడంతో అక్కడనంచే పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్టార్ హీరోకు ఉన్న లక్షలాది అభిమానులు ఏకపక్షంగా ఓట్లు వేస్తే కృష్ణా జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బే అవుతుంది. ఇంకెందుకు ఆహీరో ఎవరో ఈపాటికి మీకు తెలిసే ఉంటుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read