Sunday, May 4, 2025
- Advertisement -

సామాజిక న్యాయం చేయడంలో జగన్​ తర్వాతే ఎవరైనా..!

- Advertisement -

ఏపీ సీఎం జగన్​ నామినేటేడ్​, కార్పొరేషన్​ పదవుల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్​కు అండగా నిలబడ్డ వాళ్లకు, వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యే, ఎంపీ టికెట్​ రానివాళ్లకు పదవులు దక్కాయి. ఇక మహిళలకు, వెనకబడ్డ కులాల వాళ్లకు అవకాశాలు దక్కాయి.

ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్​ సిఫార్స్​ వల్ల తమకు పదవులు దక్కలేదని కొందరు నేతలు విమర్శలు చేయగా.. ఆయన స్పందించారు. తాను ఎవరినీ సిఫార్సు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్​ మోహన్​రెడ్డి సామాజిక వర్గ సమీకరణాలు, ఇతరత్రా అన్ని లెక్కలు వేసుకొని పదవుల పంపకం చేపట్టారని పేర్కొన్నారు.

Also Read: ‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్​కు కావాలి..! రాహుల్ గాంధీ..!

‘ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా’ అంటూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత సీఎం జగన్​ మాత్రం అన్ని వర్గాల వాళ్లకు న్యాయం చేస్తున్నారు. గతంలో కేవలం కొన్ని కులాలకు మాత్రమే కార్పొరేషన్ పదవులు దక్కేవి. కానీ ప్రస్తుతం రాష్ట్ర క్యాబినేట్​ దగ్గర నుంచి అన్ని కీలక పోస్టులు అన్ని కులాల వాళ్లకు దక్కుతున్నాయి.’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్​ అన్ని వర్గాల నేతలకు నామినేటేడ్​ పదవులు అప్పగించారంటూ హర్షం వ్యక్తం అవుతున్నది.

Also Read: వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -