కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మళ్లీ బలం పుంజుకొనేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను చక్కదిద్దుతోంది. ఈ క్రమంలో ఇటీవల రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులతో ఆన్లైన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సింధియా అనే వ్యక్తి బీజేపీకి భయపడి ఆ పార్టీలో చేరి.. ప్రస్తుతం కేంద్ర మంత్రి అయ్యాడు. అటువంటి వ్యక్తులు మనకు అక్కర్లేదు. పోరాడే ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే కాంగ్రెస్కు అవసరం.
కాంగ్రెస్లో ఉండి ఇతర పార్టీలకు భయపడే వాళ్లు వెళ్లిపోవచ్చు.ఏ అధికార పార్టీతోనైనా రాజీలేని పోరాటం చేసేవాళ్లు, ప్రజాసమస్యలపై కొట్లాడేవాళ్లు మాత్రమే మనకు కావాలి. భయపడే వాళ్లు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ దాదాపు 3500 మంది సోషల్ మీడియా కార్యకర్తలతో నేరుగా మాట్లాడారు. ఇంతమందితో జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి. ఆ సందర్భంగా కార్యకర్తలో ధైర్యం నింపారు.తనతో మాట్లాడేందుకు ఎవరూ భయపడవద్దని.. తాను మీ సోదరుడి లాంటి వాడినేనని ధైర్యం నింపారు. మరోవైపు ఇటీవల రాహుల్ గాంధీ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు.
Also Read : వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!