Friday, April 19, 2024
- Advertisement -

‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్​కు కావాలి..! రాహుల్ గాంధీ..!

- Advertisement -

కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ దేశవ్యాప్తంగా మళ్లీ బలం పుంజుకొనేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను చక్కదిద్దుతోంది. ఈ క్రమంలో ఇటీవల రాహుల్​ గాంధీ.. కాంగ్రెస్​ పార్టీ సోషల్​ మీడియా ప్రతినిధులతో ఆన్​లైన్​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్​ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సింధియా అనే వ్యక్తి బీజేపీకి భయపడి ఆ పార్టీలో చేరి.. ప్రస్తుతం కేంద్ర మంత్రి అయ్యాడు. అటువంటి వ్యక్తులు మనకు అక్కర్లేదు. పోరాడే ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే కాంగ్రెస్​కు అవసరం.

కాంగ్రెస్​లో ఉండి ఇతర పార్టీలకు భయపడే వాళ్లు వెళ్లిపోవచ్చు.ఏ అధికార పార్టీతోనైనా రాజీలేని పోరాటం చేసేవాళ్లు, ప్రజాసమస్యలపై కొట్లాడేవాళ్లు మాత్రమే మనకు కావాలి. భయపడే వాళ్లు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్​ గాంధీ దాదాపు 3500 మంది సోషల్​ మీడియా కార్యకర్తలతో నేరుగా మాట్లాడారు. ఇంతమందితో జూమ్​ మీటింగ్​లో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి. ఆ సందర్భంగా కార్యకర్తలో ధైర్యం నింపారు.తనతో మాట్లాడేందుకు ఎవరూ భయపడవద్దని.. తాను మీ సోదరుడి లాంటి వాడినేనని ధైర్యం నింపారు. మరోవైపు ఇటీవల రాహుల్ గాంధీ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు.

Also Read : వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -