Thursday, April 18, 2024
- Advertisement -

వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!

- Advertisement -

దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టికి ఎంతో విదేయుడుగా పనిచేసాడో అందరికి తెలిసిన విషయమే. కాని కాంగ్రెస్ వైఎస్ఆర్ మరణం అనంతరం తన కుటుంబంపై వ్యవహరించిన తీరే ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టకకు కారణమా అంటే అవ్వుననే చెప్పాలి.

కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న వైఎస్ కుటుంబం.. తరువాత జగన్ పై కక్షసాదింపు బాగంలోనే అక్రమ కెసులు పెట్టి జైలుకు పంపించింది. కాంగ్రెస్ వైఎస్ కుటుంబం పై వ్యవహరించిన తీరు పై అనాడే కాంగ్రెసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భుస్థాపితం చేయాలని బావించింది వైఎస్ కుటుంబం. కాని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవిభజన చేసింది.

అప్పటే తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర వైఎస్ కుటుంబం పై ఉన్నది. అందుకనే మొదటగా టర్గెట్ ఆంధ్రప్రదేశ్ పై పోకష్ పెట్టి అక్కడ కాంగ్రెస్ ను భుస్థాపితం చేయాలనుకున్నారు. ఆంధ్రలో కాంగ్రెస్ భుస్థాపితం కావడానికి రాష్ట్రాన్ని విడగొట్టడం ఓక కారణం అయితే.. అక్కడ ఉన్న వైఎస్ఆర్ అభిమానులను ఆక్కట్టుకొని జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక కారణం.

వైఎస్ కుటుంబంకు మరో శత్రువు టీడీపీ. ఎందుకంటే కాంగ్రెస్ తో కలసి వైఎస్ కుటుంబం పై కక్షసాదింపులో బాగం కావడమే. అయితే ఆంధ్రలో అప్పటికే బలపడి ఉన్నా టీడీపీ పై కూడా టర్గెట్ పెట్టారు. వైఎస్ కుటుంబం మొత్త రోడ్డుపైకి వచ్చి ముమ్మర ప్రయత్నాలు చేసారు. అయితే మొదట అశించినంత పలితం రాకపోయినా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రమత్నం చేసారు. అందులో బాగంగానే 2019 ఎన్నికల్లో అప్పటికే ఆంధ్రలో భుస్థాపితం అయిన కాంగ్రెస్ ను పక్కన పెట్టి టార్గెట్ టీడీపీ అంటు విజయమ్మ, షర్మిల, జగన్ ముమ్మరంగా ప్రచారం చేసారు. తండ్రి చేసిన పాదయాత్రకు అనుగుణంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లొ ప్రభంజనం సృష్టంచారు. ప్రసుతం ఆంధ్రలో టీడీపీ కనుమరుగైయ్యే పరిస్థిలలో ఉంది.

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చికూడా ఇక్కడ నాయకులలో సఖ్యతలేక బలపడలేక పోయింది. అయితే ఇప్పడు వైఎస్ కుటుంబం ముందు ఉన్న టార్గెట్ తెలంగాణలోని కాంగ్రెస్ ను భుస్థాపితం చేయడం. అందులో బాగంగానే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందా..? అవ్వును అనే సంకేతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రలో బద్ద శత్రువు అయిన టీడీపీ తెలంగాణలో భుస్థాపితం అయింది. తెలంగాణలోని టీడీపీ నాయకులు అందురు ఇతర పార్టీలోకి వెల్లిపోగా.. గతంలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేసాయి.

బద్ద శత్రువులు అయిన టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణలో ఓక్కటి అవ్వడం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వైఎస్ కుటుంబంకు అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీకి ఎంతో సన్నిహితుడైనా రెవంత్ రెడ్దికి పీసీసీ దక్కుతుందని గ్రహించిన వైఎస్ కుటుంబం తెలంగాణలో పార్టీ స్థాపనకు ఇదే సరైన సమయం అనుకుంది. ఇందుకు ఎన్నో కసరత్తులు చేసి వైఎస్ షర్మిలను భరిలో దించినట్టు సమాచారం. అందుకే వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..! అని చెప్పవచ్చు.

తెలంగాణలో వైఎస్ఆర్ కు ఎంతోమంది అభిమనులున్నారు. వైఎస్ఆర్ అభిమానులను ఓ తాటిపై తెచ్చి. రెవంత్ రెడ్దికి పీసీసీ ఇవ్వడంతో ఎంప్పటి నుండో కాంగ్రెసును నమ్ముకొని అసంతృప్తిగా ఉన్న నాయకులపై దృష్టిపెట్టి ఒక దెబ్బకు రెండు పిట్టలు… అన్నటూ.. తెలంగాణలో కూడా అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ ను భుస్థాపితం చేయడానికే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అనుకున్నది అనుకున్నటు జరితే తెలంగాణలో ప్రత్యాన్యాయ పార్టీగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎదగనుందా లేదా వేచిచూడాలి.

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -