రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముగ్గురు కాంగ్రెస్ సీఎంల క్యాబినెట్ లో మంత్రిగా విధులు నిర్వహించిన సునీతా లక్ష్మారెడ్డిని కేసీఆర్ ఎంపిక చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ, సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కమిషన్ లో సునీతతో పాటు కుమ్రు ఈశ్వరీ బాయి, సుధం లక్ష్మి, కటారి రేవతీరావు, షహీనా అఫ్రోజ్, ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ తదితరులు సభ్యులుగా ఉంటారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999లో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, సునీతా లక్ష్మారెడ్డి గతంలో వైఎస్ తో పాటు, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆమె సమర్ధతను గుర్తించిన కేసీఆర్, మహిళా కమిషన్ బాధ్యతలను అప్పగించారు.