Friday, April 26, 2024
- Advertisement -

రజినీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. క్షేమంగా డిశ్చార్జ్..!

- Advertisement -

సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.  డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా ఆయనలో లేవు. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో రజినీకాంత్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

రెండు రోజుల పాటు చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని.. బీపీ కూడా అదుపులోకి వచ్చిందని అపోలో వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడడంతో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. కాగా,  ఒత్తిడికి గురికాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని రజినీకి వైద్యులు సూచించారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -