2019 జూన్ 27న దివంగత నటి విజయ నిర్మల గారు ఈ లోకాన్ని విడిచిపోయిన విషయం తెలిసిందే. ఆమె 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. సినిమాల్లోకి తన 11వ ఏటనే ఎంట్రీ ఇచ్చారు. 200కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు.
2002లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాధించుకున్న విషయం తెలిసిందే. విజయ నిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారికి రెండవ భార్య అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అంతకు ముందే ఈమెకు వేరే వ్యక్తితో పెళ్ళైన విషయం చాలా తక్కువ మందికి తెలియదు. అతనితో ఈమెకు అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయిన.. కొన్నాళ్ళ తరువాత ఈమె కృష్ణ గారిని పెళ్ళి చేసుకుంది. ఇదిలా ఉండగా.. మన సహజనటి జయసుధ గారు కూడా విజయ నిర్మల గారికి దగ్గర బంధువు అన్న విషయం చాలా మందికి తెలియదు. జయసుధ గారికి విజయ నిర్మల గారు అత్త అవుతారు.
కృష్ణ-విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాలో జయసుధ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. విజయ నిర్మల గారే ఆమెను ఈ పాత్రకు ఎంచుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారట. ఆ తర్వాత జయసుధ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ గారి ఇంట్లో ఏ వేడుక జరిగినా జయసుధ గారు ఫ్యామిలీతో సహా హాజరవుతారు.
Also Read
రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు..!
టాలీవుడ్ హీరోల పెళ్లిలు, ఖర్చు, కట్నాలు..!
బాలకృష్ణ కెరీర్ డిజాస్టర్ అయినా సినిమాలు..!
సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !