Sunday, May 4, 2025
- Advertisement -

ర‌చ్చ ర‌చ్చ‌చేసిన బంగ్లా క్రికెట‌ర్లు…డ్ర‌స్సెంగ్ రూమ్ అద్దాలు ద్వంసం

- Advertisement -

నిదహస్‌ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తీవ్ర పరిణామాలు జరిగాయి. శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్ మైదానంలో రచ్చరచ్చ చేసింది. ఒకానొక దశలో మ్యాచ్‌ నిలిచిపోతుందేమో అనిపించేలా పసికూన జట్టు క్రికెటర్లు వ్యవహరించారు. అయితే.. ఎట్టకేలకి ఆ జట్టు కోచ్, అంపైర్లు చొరవ తీసుకుని ఆటగాళ్లని శాంతపరచడంతో.. మ్యాచ్ కొనసాగగా బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌ తర్వాత.. ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో మహ్మదుల్లా (43 నాటౌట్: 18 బంతుల్లో 3×4, 2×6) ఒంటరిపోరాటం చేస్తుండంతో ఆ జట్టు విజయంపై నమ్మకంతోనే ఉంది. కానీ చివరి ఓవర్ వేసిన శ్రీలంక బౌలర్ ఉదాన.. తొలి రెండు బంతుల్ని షార్ట్ పిచ్ బంతులుగా విసిరాడు. అయితే.. వాటిని క్రీజులో ఉన్న ముస్తాఫిజుర్ బ్యాట్‌తో తాకించలేకపోయాడు. అయినప్పటికీ.. రెండో బంతికి రన్ కోసం ప్రయత్నించి ముస్తాఫిజుర్ రనౌటయ్యాడు. ఈ సమయంలో మహ్మదుల్లా‌కి డ్రింక్స్ తీసుకొచ్చిన సబ్‌స్టిట్యూడ్ ఫీల్డర్ నూరుల్.. శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరాతో గొడవపడ్డాడు. బంతి బ్యాట్స్‌మెన్‌ భుజం కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. నోబాల్ ఇవ్వాలంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోని అంపైర్లని డిమాండ్ చేశారు

ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు. అప్పటికి 4 బంతుల్లో బంగ్లా 12 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు. మరోవైపు కెప్టెన్‌కి బంగ్లాదేశ్ కోచ్ సర్దిచెప్పడంతో.. ఆట కొనసాగింది.

తర్వాత మహ్మదుల్లా వరుసగా 4, 2, 6 బాది ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. గెలుపు అనంతరం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైదానంలో సంబరాలతో హోరెత్తించారు. డ్రెస్సింగ్ రూములో ఓ అద్దాన్ని కూడా పగలగొట్టారు.

ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది.

మొదట కుశాల్ పెరీరా (61: 40 బంతుల్లో 7×4, 1×6), తిసార పెరీరా (58: 37 బంతుల్లో 3×4, 3×6) అర్ధశతకాల బాదడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తమీమ్ ఇక్బాల్ (50: 42 బంతుల్లో 4×4, 2×6), మహ్మదుల్లా మెరుపులు మెరిపించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని19.5 ఓవర్లలో 160/8తో ఛేదించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -