భారత క్రికెట్లో ద్రావిడ్ హవా ప్రారంభమైందా.. ఇటీవల టీ 20 కెప్టెన్సీ పగ్గాలు వదిలేసిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు తన స్వతహాగానే వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేశారా.. లేక సెలక్టర్లే తప్పించారా.. బీసీసీఐ చెప్పిన విధంగా కోహ్లీ నడుచుకోవడం లేదా.. గతంలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనన్న కోహ్లీ ఇప్పుడెందుకు మాట మార్చారు.
భారత క్రికెట్లో సంచలనాలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ హెడ్ కోచ్గా భాద్యతులు చేపట్టిన రాహుల్ ద్రావిడ్ తన జట్టును తానే ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ను తప్పించారని కొహ్లీ ఫ్యాన్స్ ద్రావిడ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు టీ 20 సారథి పగ్గాలు వద్దంటే కొహ్లీ వదిలేశాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి గతంలోనే అన్నారు. దీనికి స్పందించిన విరాట్ కొహ్లీ తనను ఎవ్వరూ వద్దనలేదని, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే గంటన్నర ముదు తనకు సెలక్టర్లు చెప్పారని విరాట్ ఆవేదన వ్యక్తం చేశాడు. వన్డే కేప్టెన్సీ గురించి తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండా తనకు కాల్ చేసి వన్డే కెప్టెన్సీ నుంచి నిన్ను తప్పిస్తున్నామన్నారని విరాట్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విరాట్ కొహ్లీకి, బీసీసీఐకి మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుకాల గంగూలి సైతం ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.
మునుపటి విరాట్ను చూడబోతున్నాం